Sunday, 4 October 2015

GAYATRI MANTRAM VERY PEACEFUL CHANTING MANTRAM

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య


ప్రతిపదార్ధం :

ఓం     :     ప్రణవనాదం   భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. తత్‌     :    ఆ సవితుర్‌     :    సమస్త జగత్తును వరేణ్యం     :    వరింపదగిన భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను ధీమహి     :    ధ్యానించుచున్నాను ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి. 
 AUM BHOOR BHUWAH SWAHA,
TAT SAVITUR VARENYAM
BHARGO DEVASAYA DHEEMAHI
DHIYO YO NAHA PRACHODAYAT.
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेन्यं । भर्गो देवस्य धीमहि, धीयो यो न: प्रचोदयात् ।।


No comments:

Post a Comment